అమెరికా-ఇరాన్ సంక్షోభం... చమురు మార్కెట్లో కల్లోలం.. భారత్పైనా ప్రభావం!
- ఇరాన్ పోర్టులను దిగ్బంధించిన అమెరికా సైన్యం
- ప్రపంచ మార్కెట్కు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురుకు కోత
- భారత్ ఎల్పీజీ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
- ప్రత్యామ్నాయ మార్గాల్లో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు
అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన ఓడరేవులను దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ చర్యతో ఇరాన్ నుంచి రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతులు నిలిచిపోనున్నాయని, ఫలితంగా ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నోమురా వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా చర్యల ప్రభావం భారత్పైనా తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తే, భారత్కు వచ్చే ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగవచ్చు. గత నెలలోనే భారత్కు చెందిన ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని నోమురా విశ్లేషకుడు బినీత్ బంకా తెలిపారు. మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఏ నౌక కూడా ఇరాన్కు రుసుము (టోల్) చెల్లించరాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
విఫలమైన శాంతి చర్చలు.. 107 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
ఈ సంక్షోభ నివారణకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, మళ్లీ చర్చలు జరగవచ్చన్న ఆశలతో మంగళవారం నాడు క్రూడ్ ధర 100 డాలర్ల దిగువకు చేరింది. చర్చలు విఫలమవడంతో చమురు ధరలపై యుద్ధ భయాల ప్రభావం మరింత పెరగవచ్చని నోమురా అంచనా వేసింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. హర్మూజ్ జలసంధిని తప్పించుకుని, ఎర్ర సముద్రంలోకి తెరుచుకునే తన ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ద్వారా చమురు రవాణా సామర్థ్యాన్ని రోజుకు 7 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకుంది. దీని ద్వారా మార్చిలో 4.4 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతి చేసిన సౌదీ, భవిష్యత్తులో రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల వరకు ఎగుమతి చేసే అవకాశం ఉందని నోమురా పేర్కొంది.
ఆశ్చర్యకరంగా ఈ యుద్ధ వాతావరణం ఇరాన్కు ఆర్థికంగా లాభం చేకూర్చినట్లు తెలుస్తోంది. మార్చిలో ఇరాన్ చమురు ఆదాయాలు గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగి 5.7 బిలియన్ డాలర్లకు చేరాయని బంకా అంచనా వేశారు. ఎగుమతులు తగ్గినా, ధరలు పెరగడంతో ఇరాన్ ఆదాయం గణనీయంగా పెరిగింది.
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నోమురా వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా చర్యల ప్రభావం భారత్పైనా తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తే, భారత్కు వచ్చే ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగవచ్చు. గత నెలలోనే భారత్కు చెందిన ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని నోమురా విశ్లేషకుడు బినీత్ బంకా తెలిపారు. మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఏ నౌక కూడా ఇరాన్కు రుసుము (టోల్) చెల్లించరాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
విఫలమైన శాంతి చర్చలు.. 107 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
ఈ సంక్షోభ నివారణకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, మళ్లీ చర్చలు జరగవచ్చన్న ఆశలతో మంగళవారం నాడు క్రూడ్ ధర 100 డాలర్ల దిగువకు చేరింది. చర్చలు విఫలమవడంతో చమురు ధరలపై యుద్ధ భయాల ప్రభావం మరింత పెరగవచ్చని నోమురా అంచనా వేసింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. హర్మూజ్ జలసంధిని తప్పించుకుని, ఎర్ర సముద్రంలోకి తెరుచుకునే తన ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ద్వారా చమురు రవాణా సామర్థ్యాన్ని రోజుకు 7 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకుంది. దీని ద్వారా మార్చిలో 4.4 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతి చేసిన సౌదీ, భవిష్యత్తులో రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల వరకు ఎగుమతి చేసే అవకాశం ఉందని నోమురా పేర్కొంది.
ఆశ్చర్యకరంగా ఈ యుద్ధ వాతావరణం ఇరాన్కు ఆర్థికంగా లాభం చేకూర్చినట్లు తెలుస్తోంది. మార్చిలో ఇరాన్ చమురు ఆదాయాలు గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగి 5.7 బిలియన్ డాలర్లకు చేరాయని బంకా అంచనా వేశారు. ఎగుమతులు తగ్గినా, ధరలు పెరగడంతో ఇరాన్ ఆదాయం గణనీయంగా పెరిగింది.